లండన్ పార్సన్స్ గ్రీన్ రైల్వే స్టేషన్ ట్యూబ్ ట్రైన్లో పేలుళ్లు
- September 15, 2017
పార్సన్స్ గ్రీన్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం పేలుళ్ళు సంభవించాయి. ట్యూబ్ ట్రైన్లో జరిగిన ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. లండన్ మెట్రో పాలిటన్ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
రైలు వెనుక భాగంలో ఓ బకెట్ నుంచి పేలుళ్ళు వినిపించాయని అంటున్నారు. సంఘటనా స్థలానికి భద్రతాధికారులు హుటాహుటిన తరలి వెళ్ళారు. తనిఖీలు నిర్వహించేందుకు రైల్వే స్టేషన్ను మూసివేశారు. చాలా మంది ప్రయాణికులు కాలిన గాయాలతో పరుగులు తీస్తున్నట్లు సమాచారం.
అత్యవసర సహాయక దళాలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ లండన్లో ఉంది. ఇది అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారని పోలీసులు ట్విట్టర్లో తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







