ఈజిప్ట్ వ్యక్తి నుంచి 4 వేల మాదక ద్రవ్య మాత్రలు స్వాధీనం
- September 15, 2017
మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే, గల్ఫ్ దేశాలలో కఠినమైన శిక్షలు అక్కడ విధిస్తారని తెల్సినప్పటికే అక్రమ రవాణాదారులు తమ తరలింపు తంతుని మానడంలేదు. తాజాగా ఈజిప్ట్కు చెందిన ఓ వ్యక్తి కువైట్కు వలస వెళ్లాడు. కువైట్ విమానాశ్రయంలోకి రాగానే ఆ ఈజిప్టియడు కొంత ఆందోళనగా కనిపించాడు. పోలీసులను చూసి కంగారుగా వేగంగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు హడావిడి పడ్డాడు. ఆ అనుమానితుడి వ్యవహారశైలీని విమానాశ్రయ అధికారులకు సందేహం కల్గింది. ఆ వ్యక్తికి చెందిన బ్యాగును క్షుణంగా తనిఖీ చేయగా అందులో ఓ ప్యాకెట్ కనిపించింది. ఆ బ్యాగులో 4వేల మాదకద్రవ్య మాత్రలు కంటపడ్డాయి. ఆ నిషేధిత మాత్రలు కువైట్లో కల్గి ఉండటమే పెద్ద నేరం కావడంతో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు. అనంతరం ఆ మాధకద్రవ్యాలని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







