ఒమన్ లో " మెర్స్-కోవిక్ " కేసును ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ
- September 15, 2017
ఆగస్టు 30 వ తేదీన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (మెర్స్-కోవి) కేసును ఒమన్ నివేదించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆగస్టు 15 వ తేదీ నుండి 30 వ తేదీ మధ్య కాలంలో సౌదీ అరేబియా నుంచి పన్నెండు కేసులు నమోదయ్యాయి. రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (మెర్స్-కోవి) కు చెందిన చివరి కేసు నవంబర్ 29, 2016 న జరిగిందని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఏడాది ఆగస్టు 30 వ తేదీ , జాతీయ ఐహెచ్ఆర్ ఫోకల్ పాయింట్ ఒమన్ లో మెర్స్-కోవిక్ ఒక కేసు నమోదు చేసింది. మస్నాహ్ కు చెందిన 54 ఏళ్ల వయస్సు గల ఒక పురుషుడికి మెస్-కోవివ్ వ్యాధి సోకడంతో ఆగష్టు 21 వ తేదీన ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వ్యాధిని రుజువు చేస్తూ ప్రయోగశాల నిర్ధారణ జరిగింది. ఆగస్టు 29 వ తేదీ నాటికి రోగి పరిస్థితి నిలకడగా ఉంది. "ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రోగి చికిత్స చేయబడిన ఆసుపత్రులలో ఆ వ్యాధికి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంది. కుటుంబ మరియు ఆరోగ్య కార్మికులను అనుసరిస్తుంది. రోగ లక్షణాలను బట్టి మెర్స్-కోవిక్ అధిక-ప్రమాదకరమైన కుటుంబానికి తగిన ఆరోగ్య పరీక్షలు జరపాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







