నూతన తారలు కావలెను - పూరి జగన్నాధ్

- September 15, 2017 , by Maagulf
నూతన తారలు కావలెను - పూరి జగన్నాధ్

మీరు వెండి తెర ఫై కనిపించాలని , మీ టాలెంట్ తో అభిమానులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..అయితే వెంటనే 'పూరి కనెక్ట్' ను సంప్రదించండి..ఎందుకంటే త్వరలో పూరి చేయబోయే కొత్త సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకుంటున్నాడు. ఈ మేరకు ప్రకటన చేసాడు. ఇటీవల బాలయ్యతో చేసిన పైసా వసూల్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముస్కాన్. పూరి స్థాపించిన 'పూరి కనెక్ట్' అనే కంపెనీ నుంచి ఈ అమ్మడు వెండి తెర కు పరిచయం అయ్యింది. ఇప్పుడిదే సంస్థ మరోసారి నటీనటుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
 
18-50ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎవరైనా పూరి కనెక్ట్ ను సంప్రదించవచ్చు. కానీ వాళ్ల దగ్గర యాక్టింగ్ టాలెంట్ ఉండాలి అని తెలిపింది. తన కొత్త సినిమాకు వాళ్లు పనికొస్తారని తెలిస్తే వెంటనే అగ్రిమెంట్ చేసుకోడానికి సంస్థ రెడీగా ఉన్నట్లు తెలిపింది. ఈ వ్యవహారాలన్నింటినీ చార్మి దగ్గరుండి చూసుకుంటుంది. కాకపోతే నటీనటుల ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం పూరిజగన్నాధ్ దే. ఫైనల్ లిస్ట్ తయారుచేయడం వరకు చార్మి పని అంటున్నారు.

ప్రస్తుతం పూరి తన కొడుకు ఆకాష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయ్యినట్లు సమాచారం. ఈ మూవీ లోనే కొత్త నటి నటులను తీసుకొన బోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం మిలో టాలెంట్ ఉంటే వెంటనే 'పూరి కనెక్ట్' ను సంప్రదించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com