నూతన తారలు కావలెను - పూరి జగన్నాధ్
- September 15, 2017
మీరు వెండి తెర ఫై కనిపించాలని , మీ టాలెంట్ తో అభిమానులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..అయితే వెంటనే 'పూరి కనెక్ట్' ను సంప్రదించండి..ఎందుకంటే త్వరలో పూరి చేయబోయే కొత్త సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకుంటున్నాడు. ఈ మేరకు ప్రకటన చేసాడు. ఇటీవల బాలయ్యతో చేసిన పైసా వసూల్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముస్కాన్. పూరి స్థాపించిన 'పూరి కనెక్ట్' అనే కంపెనీ నుంచి ఈ అమ్మడు వెండి తెర కు పరిచయం అయ్యింది. ఇప్పుడిదే సంస్థ మరోసారి నటీనటుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
18-50ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎవరైనా పూరి కనెక్ట్ ను సంప్రదించవచ్చు. కానీ వాళ్ల దగ్గర యాక్టింగ్ టాలెంట్ ఉండాలి అని తెలిపింది. తన కొత్త సినిమాకు వాళ్లు పనికొస్తారని తెలిస్తే వెంటనే అగ్రిమెంట్ చేసుకోడానికి సంస్థ రెడీగా ఉన్నట్లు తెలిపింది. ఈ వ్యవహారాలన్నింటినీ చార్మి దగ్గరుండి చూసుకుంటుంది. కాకపోతే నటీనటుల ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం పూరిజగన్నాధ్ దే. ఫైనల్ లిస్ట్ తయారుచేయడం వరకు చార్మి పని అంటున్నారు.
ప్రస్తుతం పూరి తన కొడుకు ఆకాష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయ్యినట్లు సమాచారం. ఈ మూవీ లోనే కొత్త నటి నటులను తీసుకొన బోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం మిలో టాలెంట్ ఉంటే వెంటనే 'పూరి కనెక్ట్' ను సంప్రదించండి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







