డేరాకు పెరగనున్న జైలు శిక్ష
- September 16, 2017
ఇప్పటికే రెండు అత్యాచారం కేసుల్లో దోషిగా నిర్ధారణ అయ్యి, ఇరవై సంవత్సరాల శిక్షను ఎదుర్కొంటూ జైలు పాలైన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ మరో రెండు హత్య కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నాడు. డేరా బాబా అక్రమాల గురించి వార్తలను ప్రచురించిన ఒక జర్నలిస్టు, బాబాకు ఎదురుతిరిగిన డేరా మేనేజర్ ఒకరు కొన్నేళ్ల కిందట హత్యకు గురయ్యారు. తుపాకీతో కాల్చి వారిని చంపారు అగంతకులు. ఈ కేసులపై కూడా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సీబీఐ కోర్టు ముందుకు మరోసారి విచారణకు రానుంది.ప్రస్తుతం గుర్మీత్ రోహ్తక్ జైల్లో ఉన్నాడు. అక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని కోర్టు విచారించనుంది. హత్య కేసుల్లో పక్కా ఆధారాలను సీబీఐ అధికారులు సమర్పించారని సమాచారం. మరి ఇప్పటికే ఇరవై సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడే గుర్మీత్. మరి ఈ కేసుల్లో కూడా అతడు దోషిగా తేలితే.. జైలు శిక్ష మరింత పెరుగుతుందా? లేక ఏకంగా ఉరి శిక్షే పడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు డేరా బాబాపై హత్య కేసుల విచారణ నేపథ్యంలో హర్యానాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రేప్ కేసుల్లో గుర్మీత్ ను దోషిగా ప్రకటించినప్పుడు, అతడికి శిక్ష పడినప్పుడు అతడి అనుచరులు భారీ ఎత్తున అల్లర్లు సృష్టించారు. వందల కోట్ల ఆస్తుల నష్టం కలిగించారు. హత్య కేసుల విచారణ నేపథ్యంలో అలాంటి అల్లర్లకు ఆస్కారం ఉందని పోలీసులు..ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







