డేరాకు పెరగనున్న జైలు శిక్ష
- September 16, 2017
ఇప్పటికే రెండు అత్యాచారం కేసుల్లో దోషిగా నిర్ధారణ అయ్యి, ఇరవై సంవత్సరాల శిక్షను ఎదుర్కొంటూ జైలు పాలైన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ మరో రెండు హత్య కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నాడు. డేరా బాబా అక్రమాల గురించి వార్తలను ప్రచురించిన ఒక జర్నలిస్టు, బాబాకు ఎదురుతిరిగిన డేరా మేనేజర్ ఒకరు కొన్నేళ్ల కిందట హత్యకు గురయ్యారు. తుపాకీతో కాల్చి వారిని చంపారు అగంతకులు. ఈ కేసులపై కూడా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సీబీఐ కోర్టు ముందుకు మరోసారి విచారణకు రానుంది.ప్రస్తుతం గుర్మీత్ రోహ్తక్ జైల్లో ఉన్నాడు. అక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని కోర్టు విచారించనుంది. హత్య కేసుల్లో పక్కా ఆధారాలను సీబీఐ అధికారులు సమర్పించారని సమాచారం. మరి ఇప్పటికే ఇరవై సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడే గుర్మీత్. మరి ఈ కేసుల్లో కూడా అతడు దోషిగా తేలితే.. జైలు శిక్ష మరింత పెరుగుతుందా? లేక ఏకంగా ఉరి శిక్షే పడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు డేరా బాబాపై హత్య కేసుల విచారణ నేపథ్యంలో హర్యానాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రేప్ కేసుల్లో గుర్మీత్ ను దోషిగా ప్రకటించినప్పుడు, అతడికి శిక్ష పడినప్పుడు అతడి అనుచరులు భారీ ఎత్తున అల్లర్లు సృష్టించారు. వందల కోట్ల ఆస్తుల నష్టం కలిగించారు. హత్య కేసుల విచారణ నేపథ్యంలో అలాంటి అల్లర్లకు ఆస్కారం ఉందని పోలీసులు..ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









