సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి అవకాశం ఇవ్వం: చైనా
- September 16, 2017
అప్పుడే చైనాకు ఉలుకు మొదలైంది. భారత్తో జపాన్ సంబంధాలు మరింత ధృడమవుతాయని, ఈశాన్య రాష్ట్రాలతో సహా భారత్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో భారత్ జపాన్ కలిసి పరస్పరం సమన్వయంతో ముందుకు సాగుతాయని ప్రకటన చేయడంతో చైనా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ భారత్తో సరిహద్దు విభేదాల గురించి ప్రస్తావించారు.
సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి (జపాన్)కు అవకాశం ఇవ్వబోమని అన్నారు. అరుణాచల్ప్రదేశ్లో తలపెట్టనున్న అభివృద్ధిపనులకు జపాన్ సహకారం అందించనున్న నేపథ్యంలో అందుకు తాము అనుమతించబోమంటూ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు భారత్లోని ఇతర ప్రధాని రాష్ట్రాలకు మధ్య పూర్తి స్థాయి సంబంధాలు నెలకొనేలా మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుచయనున్నట్లు తెలిపారు. అరుణాచల్ప్రదేశ్ విషయంలో పలుమార్లు చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









