సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి అవకాశం ఇవ్వం: చైనా
- September 16, 2017
అప్పుడే చైనాకు ఉలుకు మొదలైంది. భారత్తో జపాన్ సంబంధాలు మరింత ధృడమవుతాయని, ఈశాన్య రాష్ట్రాలతో సహా భారత్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో భారత్ జపాన్ కలిసి పరస్పరం సమన్వయంతో ముందుకు సాగుతాయని ప్రకటన చేయడంతో చైనా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ భారత్తో సరిహద్దు విభేదాల గురించి ప్రస్తావించారు.
సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి (జపాన్)కు అవకాశం ఇవ్వబోమని అన్నారు. అరుణాచల్ప్రదేశ్లో తలపెట్టనున్న అభివృద్ధిపనులకు జపాన్ సహకారం అందించనున్న నేపథ్యంలో అందుకు తాము అనుమతించబోమంటూ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు భారత్లోని ఇతర ప్రధాని రాష్ట్రాలకు మధ్య పూర్తి స్థాయి సంబంధాలు నెలకొనేలా మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుచయనున్నట్లు తెలిపారు. అరుణాచల్ప్రదేశ్ విషయంలో పలుమార్లు చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







