సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి అవకాశం ఇవ్వం: చైనా

- September 16, 2017 , by Maagulf
సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి అవకాశం ఇవ్వం: చైనా

అప్పుడే చైనాకు ఉలుకు మొదలైంది. భారత్‌తో జపాన్‌ సంబంధాలు మరింత ధృడమవుతాయని, ఈశాన్య రాష్ట్రాలతో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో భారత్ జపాన్‌ కలిసి పరస్పరం సమన్వయంతో ముందుకు సాగుతాయని ప్రకటన చేయడంతో చైనా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ అక్కడి మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో సరిహద్దు విభేదాల గురించి ప్రస్తావించారు.

సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి (జపాన్‌)కు అవకాశం ఇవ్వబోమని అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో తలపెట్టనున్న అభివృద్ధిపనులకు జపాన్‌ సహకారం అందించనున్న నేపథ్యంలో అందుకు తాము అనుమతించబోమంటూ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు భారత్‌లోని ఇతర ప్రధాని రాష్ట్రాలకు మధ్య పూర్తి స్థాయి సంబంధాలు నెలకొనేలా మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుచయనున్నట్లు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌ విషయంలో పలుమార్లు చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com