ఫ్రాన్స్లో ఆదివారం యువతులపై యాసిడ్ దాడి....
- September 17, 2017
ఫ్రాన్స్లో ఆదివారం సాయంత్రం ఘోరం జరిగింది. అమెరికన్ విద్యార్థినిలపై రైల్వే స్టేషన్లో ఓ మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా, ఉగ్రవాదిగా అనుమానించి నిందితురాలిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
బోస్టన్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిలు ప్రాజెక్టు పని కోసం దక్షిణ ప్రాన్స్కు వెళ్లారు. తాము ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో అక్కడే ఉన్న 41 ఏళ్ల మహిళ వారిపై యాసిడ్ కుమ్మరించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహిళను అరెస్ట్ చేశారు. బాధితులను చికిత్స కోసం మార్సిల్లె ఆస్పత్రికి తరలించారు.
తొలుత ఉగ్రవాద చర్యగా అనుమానించిన పోలీసులు మహిళను పలు కోణాల్లో విచారించారు. అయితే మతిస్థిమితం సరిగ్గా లేకనే ఆమె దాడికి పాల్పడినట్లు తేల్చారు. యువతుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఘటనపై యూఎస్ రాయబార కార్యాలయం సహకారంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు విద్యార్ఘుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







