ఎతిహాద్ ప్రయాణీకులకు ఇన్స్టాల్మెంట్ ఆఫర్
- September 21, 2017
యూఏఈ, కెఎస్ఎ, ఈజిప్ట్లోని ప్రయాణీకులు ఎతిహాద్ ఎయిర్ వేస్ ద్వారా ప్రయాణించేందుకు నెలవారీ వాయిదాల పద్ధతిలో టిక్కెట్లను కొనుగోలు చేసే వీలు కల్పిస్తున్నారు. ఎతిహాద్ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రీజియన్లో తొలిసారిగా ఫుల్లీ ఆటోమేటెడ్ ఆన్లైన్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్ని పే ఫోర్ట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రయాణీకులకు వెసులుబాటు కల్పిస్తోంది. ఆయా వ్యక్తుల అర్హతను బట్టి 3 నుంచి 60 నెలల ఇన్స్టాల్మెంట్స్, 17 బ్యాంకు లద్వారా పేమెంట్కి అవకాశం ఉంది. 'పే బై ఇన్స్టాల్మెంట్' ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా వాయిదాల పద్ధతిలో టిక్కెట్లను ఖరీదు చేయొచ్చు. ప్రయాణీకులకు విమానయానాన్ని మరింత చేరువగా, సులువుగా చేసేందుకోసం చేపడ్తున్న ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటని ఎతిహాద్ ఎయిర్వేస్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బి చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







