దసరా పండుగ సీజన్లలో టాలీవుడ్ సినిమాల సందడి
- September 21, 2017
టాలీవుడ్లో పండుగ సీజన్లలో సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి, దసరాల తర్వాత దీపావళికి కూడా సినిమాలు బాగానే రిలీజ్ అవుతాయి. ఈ దసరాకి రెండు పెద్ద సినిమాలు జైలవకుశ, స్పైడర్ వస్తున్నాయి. వీటితో పాటు చిన్న సినిమా మహానుభావుడు కూడా వస్తోంది. దసరా తర్వాత వచ్చే దీపావళికి కూడా సినిమాలు పోటీ పడుతున్నాయి. దీపావళికి వారం ముందు మూడు సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. వాటిల్లో ఒకటి రాజుగారి గది2.
వచ్చే నెల 19న దీపావళి పండుగ. దీనికి వారం ముందు వచ్చే సినిమాల్లో రాజుగారి గది2 ఒకటి. ఈ మూవీ వచ్చే నెల 13న విడుదలవుతోంది. హార్రర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి సక్సెస్ అయిన రాజుగారి గదికి సీక్వెల్ ఈ సినిమా. దీనికి కూడా ఓంకారే డైరెక్టర్. అయితే కీలక పాత్రల్లో నాగార్జున, సమంత నటిస్తున్నారు. అందుకే సినిమాపై క్రేజ్ ఎక్కువగా ఉంది. వీళ్ళతో పాటు సీరత్ కపూర్, షకలక శంకర్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ నటిస్తున్నారు. నిన్న రిలీజైన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
దీపావళి సీజన్లో వచ్చే మరో సినిమా ఆక్సిజన్. మాస్ హీరో గోపిచంద్ నటించిన కొత్త సినిమా ఇది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాశీఖన్నా, అను ఇమ్మానుయేలే హీరోయిన్లుగా నటించారు. ఎ.ఎమ్.రత్నం చాలా రోజుల తర్వాత ఈ చిత్రాన్ని నిర్మించి, ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ వచ్చే నెల 12న విడుదలకు రెడీ అవుతోంది.
ఇక వచ్చే నెల 12నే వస్తున్న మరో చిత్రం రాజా ది గ్రేట్. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రవితేజకి జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. రవితేజ ఇందులో అంధుడుగా నటిస్తున్నాడు. దీంతో సినిమాపై క్యూరియాసిటీ ఉంది. ఆ మధ్య టీజర్ ని మెప్పించిన టీమ్, రీసెంట్ గా టైటిల్ సాంగ్ విడుదల చేసింది. ఈ మూడు సినిమాల్లో ఆక్సిజన్ పై అంతగా అంచనాలు లేకపోయినా... రాజుగారి గది, రాజా ది గ్రేట్ పైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వీటి వల్ల దిపావళి సీజన్ కూడా సందడిగా ఉండబోతుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







