మెయిడ్పై దాడి కేసులో యజమానికి ఊరట
- September 21, 2017
మెయిడ్పై యజమాని దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించి యజమానికి ఊరట లభించింది. తనను తీవ్రంగా కొట్టి వేధించారంటూ యజమాని సహా వారి కుటుంబ సభ్యులపై మెయిడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో తమ క్లయింటు ప్రమేయం ఏమీ లేదని యజమాని తరఫు లాయర్ వాదించారు. ఇంకో వైపున మెయిడ్కి చెల్లించాల్సిన జీతం కూడా చెల్లించలేదని మెయిడ్ తరఫు లాయర్ వాదనలు విన్పించడం జరిగింది. అయితే చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాల్ని యజమాని తరఫు లాయర్ న్యాయస్థానానికి సమర్పించారు. అలాగే, యజమాని నుంచి మెయిడ్ పారిపోవడం జరిగిందనీ, ఆ తర్వాత జరిగిన ఘటనలకు ఎలా బాధ్యత వహిస్తారని న్యాయస్థానానికి తెలియజేశారు యజమాని తరఫు లాయర్. ఆధారాలన్నీ మెయిడ్కి వ్యతిరేకంగా ఉండటంతో ఈ కేసులో యజమానికి ఊరటనిచ్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







