మెయిడ్‌పై దాడి కేసులో యజమానికి ఊరట

- September 21, 2017 , by Maagulf
మెయిడ్‌పై దాడి కేసులో యజమానికి ఊరట

మెయిడ్‌పై యజమాని దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించి యజమానికి ఊరట లభించింది. తనను తీవ్రంగా కొట్టి వేధించారంటూ యజమాని సహా వారి కుటుంబ సభ్యులపై మెయిడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో తమ క్లయింటు ప్రమేయం ఏమీ లేదని యజమాని తరఫు లాయర్‌ వాదించారు. ఇంకో వైపున మెయిడ్‌కి చెల్లించాల్సిన జీతం కూడా చెల్లించలేదని మెయిడ్‌ తరఫు లాయర్‌ వాదనలు విన్పించడం జరిగింది. అయితే చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాల్ని యజమాని తరఫు లాయర్‌ న్యాయస్థానానికి సమర్పించారు. అలాగే, యజమాని నుంచి మెయిడ్‌ పారిపోవడం జరిగిందనీ, ఆ తర్వాత జరిగిన ఘటనలకు ఎలా బాధ్యత వహిస్తారని న్యాయస్థానానికి తెలియజేశారు యజమాని తరఫు లాయర్‌. ఆధారాలన్నీ మెయిడ్‌కి వ్యతిరేకంగా ఉండటంతో ఈ కేసులో యజమానికి ఊరటనిచ్చింది న్యాయస్థానం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com