దుబాయ్ లో భారతీయుడు దారుణ హత్య...స్వదేశస్థుడే హతమార్చాడు
- September 22, 2017
దుబాయ్: జన్మభూమిని ..కన్నతల్లిని విడిచి పొరుగు దేశం వెళ్లిన ఆ యువకులు తగాదాలు పడ్డారు..ఓ వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో కర్కశంగా హతమార్చాడు. దుబాయిలో ఓ ప్రవాసీయ భారతీయదు దారుణ హత్యకు గురయ్యాడు. సాటి దేశస్థుడే ఆ వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపడం స్థానికంగా సంచలనం కల్గించింది. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం జగిత్యాల మండలం, సోమన్పల్లి గ్రామానికి చెందిన 28 ఏళ్ల చంద రవి రెండేళ్ల క్రితం దుబాయికి కార్మికునిగా వెళ్లాడు. అక్కడే తెలుగువారితో కలిసి ఓ అపార్ట్మెంట్లో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే దుబాయిలోనే ఉంటున్న నిజామాబాద్ జిల్లా భీంగల్కు చెందిన ఓ యువకుడితో రెండు నెలల క్రితం ఓ విషయంలో గొడవ జరిగింది. అయితే దాన్ని రవి తీవ్రంగా తీసుకోలేదు. కాగా గురువారం ఉదయం... రవి ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు ఆ యువకుడు వచ్చి.. చంద రవిని కత్తితో పొడిచి, దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అతడి కేకలు విని అడ్డుకోవడానికి స్నేహితులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఈలోపే అతడి కత్తి పోట్లకు రవి మృతి చెందాడు . హత్య చేసిన ఆ యువకుడు పారిపోయాడు. ఈ విషయాన్ని తెలుగువాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబానికి కూడా విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపారు. కొద్ది నెలల్లో ఇంటికి వస్తాడనుకున్న భర్త.. చనిపోయాడన్న వార్త విని భార్య భవాని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మృతుడికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. దుబాయి పోలీసులు ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









