స్త్రీలోని ఎమోషనల్ యాంగిల్ను చూపే 'అమ్మాయిలంతే ..అదోటైపు'
- September 23, 2017
మన సంస్కృతికి మారు పేరుగా నిలిచిన స్త్రీలోని ఎమోషనల్ యాంగిల్ను మా 'అమ్మాయిలంతే ..అదోటైపు' సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు దర్శకుడు కృష్ణమ్. గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా ప్రధాన పాత్రధారులుగా గాయత్రి రీల్స్ బ్యానర్పై కృష్ణమ్ డైరెక్టర్గా రూపొందుతోన్న చిత్రం 'అమ్మాయిలంతే..అదోటైపు'. ఈ సినిమా ఫస్ట్లుక్ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
భావోద్వేగాలే హైలెట్ గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమిది. డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, తన తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల, తండ్రి ప్రేమకు దూరమవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, తండ్రి ప్రేమకి దూరమయ్యాననే కూతురు పడే బాధ, ఆ తరువాత జరిగే పర్యవసానల మధ్య సాగే ఎమోషనల్ కథ. నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. ఇప్పుడు ఫస్ట్లుక్ను విడుదల చేస్తున్నాం. మంచి సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుదిరింది. త్వరలోనే ఆడియోవిడుదల చేసి, అక్టొబర్ లొ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని దర్శక నిర్మాతలు తెలిపారు.
గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా, సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ః గోపీ సిందం, సినిమాటోగ్రఫీః శ్రీనివాస్, సాహిత్యం: పూర్ణాచారి, దర్శకత్వం: కృష్ణమ్.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









