పేదల కోసం ఫ్రీ కరెంట్ : ప్రధాన మంత్రి మోడీ
- September 25, 2017
ప్రధాన మంత్రి మోడీ మరో భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. దేశం మొత్తాన్ని విద్యుదీకరించాలనేది మోడీ లక్ష్యం. ఇందుకోసం ప్రధాన మంత్రి బిజిలీ సహజ్ యోజన - సౌభాగ్య స్కీమ్ను మోడీ ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దేశంలోని 3 కోట్ల మంది లబ్ది పొందనున్నారు. ఈ పథకం కోసం 14 వేల 25 కోట్లను కేటాయించింది కేంద్రం. ఇందులో 12 వేల 300 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించనుంది. ఒక ఫ్యాన్, ఐదు ఎల్ఈడీ బల్బులు ఉన్న ఇళ్లకు ఉచిత కరెంటును ఇవ్వాలనేది సౌభాగ్య యోజన పథకం ఉద్దేశం. 2019 మార్చి 31లోగా విద్యుదీకరణ పనులు పూర్తిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలనేది మోడీ టార్గెట్.
మరోవైపు దేశంలోని ఆర్థిక సమస్యలను సమీక్షించేందుకు మోడీ కొత్త ఆర్థిక సలహా సంఘాన్ని నియమించారు. ఐదుగురు సభ్యుల ఈ సంఘానికి బిబేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తారు. రతన్ వటాల్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సుర్జీత్ భల్లా, రతిన్ రాయ్, అషిమా గోయల్ సభ్యులుగా ఉంటారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







