పేదల కోసం ఫ్రీ కరెంట్ : ప్రధాన మంత్రి మోడీ

- September 25, 2017 , by Maagulf
పేదల కోసం ఫ్రీ కరెంట్ : ప్రధాన మంత్రి మోడీ

ప్రధాన మంత్రి మోడీ మరో భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. దేశం మొత్తాన్ని విద్యుదీకరించాలనేది మోడీ లక్ష్యం. ఇందుకోసం ప్రధాన మంత్రి బిజిలీ సహజ్ యోజన - సౌభాగ్య స్కీమ్‌ను మోడీ ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దేశంలోని 3 కోట్ల మంది లబ్ది పొందనున్నారు. ఈ పథకం కోసం 14 వేల 25 కోట్లను కేటాయించింది కేంద్రం. ఇందులో 12 వేల 300 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించనుంది. ఒక ఫ్యాన్, ఐదు ఎల్‌ఈడీ బల్బులు ఉన్న ఇళ్లకు ఉచిత కరెంటును ఇవ్వాలనేది సౌభాగ్య యోజన పథకం ఉద్దేశం. 2019 మార్చి 31లోగా విద్యుదీకరణ పనులు పూర్తిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలనేది మోడీ టార్గెట్‌. 

మరోవైపు దేశంలోని ఆర్థిక సమస్యలను సమీక్షించేందుకు మోడీ కొత్త ఆర్థిక సలహా సంఘాన్ని నియమించారు. ఐదుగురు సభ్యుల ఈ సంఘానికి బిబేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తారు. రతన్ వటాల్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సుర్జీత్ భల్లా, రతిన్ రాయ్, అషిమా గోయల్ సభ్యులుగా ఉంటారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com