ఐసిసి క్రికెట్లో కొత్త నిబంధనలు
- September 26, 2017
క్రికెట్లో ఐసీసీ రూపొందించిన కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి రానున్నాయి. దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్, పాకిస్థాన్ - శ్రీలంక టెస్టు సిరీస్ల్లో వీటిని అమలు చేస్తారు. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్ మాత్రం పాత నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం బ్యాట్ అంచుల మందం 40 మిల్లీ మీటర్లు మించరాదు. డెప్త్ 67 మిల్లీ మీటర్లు ఉండాలి. బ్యాట్ను కొలిచేందుకు అంపైర్లకు ప్రత్యేక కొలమానిని సమకూరుస్తారు. మైదానంలో అంపైర్లు, ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించే క్రికెటర్లను మైదానం నుంచి బయటకు పంపించే అధికారం అంపైర్లకు ఉంటుంది. ఇక నుంచి టీ20ల్లోనూ డీఆర్ఎస్ ఉపయోగించవచ్చు. పరుగు కోసం వచ్చిన బ్యాట్స్మన్ క్రీజులో ముందు బ్యాట్ ఆనించిన తర్వాత గాల్లో ఉంటే అప్పుడు బంతి వికెట్ల తాకితే ఇక మీదట నాటౌట్గా ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







