ఆప్గనిస్తాన్‌కు భారత సైనికులను పంపే ప్రసక్తే లేదు:కేంద్ర రక్షణశాఖ మంత్రి

- September 26, 2017 , by Maagulf
ఆప్గనిస్తాన్‌కు భారత సైనికులను పంపే ప్రసక్తే లేదు:కేంద్ర రక్షణశాఖ మంత్రి

ఢిల్లీ: ఆప్గనిస్తాన్‌కు భారత సైనికులను పంపే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అభివృద్ధి, వైద్య సేవలకు తదితర రంగాల్లో ఆఫ్గనిస్తాన్‌కు భారత్‌ సహాయం చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్‌ మ్యాటీస్- రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటి అయ్యారు. ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. అనంతం సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్వర్గధామాలు సహించరాదని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చినట్లు సీతారామన్‌ తెలిపారు. ఒకవేళ జేమ్స్‌ మటిస్‌ పాకిస్థాన్‌లో పర్యటిస్తే, ఆ దేశంలో ఉగ్రవాద సురక్షిత స్థావరాలు, సరిహద్దుల ఆవలి నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యలను లేవనెత్తాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఉగ్రవాదంతో భారత్‌, అమెరికాలు నష్టపోయాయని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని జేమ్స్‌ చెప్పారు. ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని జేమ్స్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com