షావుకారు జానకి కి కన్నడ రాజ్యోత్సవ పురస్కారo
- November 01, 2015
సుప్రసిద్ధ నటీమణి షావుకారు జానకిని కర్ణాటక ప్రభుత్వం నేడు సత్కరించనున్నది. కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని బహూకరించనున్నది. కర్ణాటక ప్రభుత్వం 60మంది ప్రముఖులను కన్నడ రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరిస్తున్నది. ఈ పురస్కారం కింద లక్ష రూపాయిల నగదు, 20 గ్రాముల సువర్ణ పతకాన్ని, సన్మాన పత్రాన్ని అందజేస్తారు. షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందిన శంకరమంచి జానకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాధ్యాయం అనదగ్గ కాలంలో పలు చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన షావుకారు చిత్రం పేరే ఆమె ఇంటిపేరుగా సార్థకమైంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







