షావుకారు జానకి కి కన్నడ రాజ్యోత్సవ పురస్కారo
- November 01, 2015
సుప్రసిద్ధ నటీమణి షావుకారు జానకిని కర్ణాటక ప్రభుత్వం నేడు సత్కరించనున్నది. కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని బహూకరించనున్నది. కర్ణాటక ప్రభుత్వం 60మంది ప్రముఖులను కన్నడ రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరిస్తున్నది. ఈ పురస్కారం కింద లక్ష రూపాయిల నగదు, 20 గ్రాముల సువర్ణ పతకాన్ని, సన్మాన పత్రాన్ని అందజేస్తారు. షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందిన శంకరమంచి జానకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాధ్యాయం అనదగ్గ కాలంలో పలు చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన షావుకారు చిత్రం పేరే ఆమె ఇంటిపేరుగా సార్థకమైంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









