భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం..
- September 26, 2017
హైదరాబాద్లో ఉదయాన్నే వాతావరణం చల్లగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. కూకట్పల్లి నుంచి మొదలు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, దిల్ సుఖ్నగర్, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ, ఓల్డ్సీటీలో కొన్ని ఏరియాల్లోనూ కొద్దిసేపు కుంభవృష్ణి కురిసింది. అరగంటపాటు ఏకదాటిగా కురిసిన వానకు రోడ్లపై నీరు చేరింది. ఉదయాన్నే అంతా ఆఫీస్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులంతా ఇబ్బందులు పడ్డారు.
అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటలు కోస్తా జిల్లాలతోపాటు, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో జల్లులు పడనున్నాయి. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్,మహబూబ్నగర్లో వర్షాలతో కాస్త జలకళ కనిపిస్తోంది. వారంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడుతోందని దాని ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
సడన్ వర్షం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు దాదాపు రోడ్ల పక్కనే నిలబడిపోయారు ఉద్యోగులు. మెట్రో రైలు మార్గం కింద కొంతసేపు నిలబడ్డారు. వర్షం పడినంత సేపు అక్కడ ఉన్న ఉద్యోగులు.. వాన తగ్గాక ఆఫీసులకు బయలుదేరారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







