తాజ్‌మహల్‌ని సందర్శించిన షార్జా రూలర్‌

- September 28, 2017 , by Maagulf
తాజ్‌మహల్‌ని సందర్శించిన షార్జా రూలర్‌

షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి, ఇండియా పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన ఫొటో షేర్‌ చేయగా, సన్నిహితులు, అభిమానులు అభినందనలు తెలుపుతూ కామెంట్స్‌ పోస్ట్‌ చేశారు. ఆదివారం కేరళలోని త్రివేండ్రమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన అల్‌ ఖాసిమి, ఆయన సతీమణికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఫ్రీడమ్‌ గిఫ్ట్‌ని షార్జా రూలర్‌ ప్రకటించిన సంగతి తెలిసినదే. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆహ్వానం మేరకు షార్జా రూలర్‌ నాలుగు రోజులపాటు కేరళలో పర్యటిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com