మూడేళ్ల శిక్ష పూర్తి చేసుకోనున్న భారత ఖైదీల విడుదల
- September 28, 2017
షార్జా : ' ముద్దొచ్చినపుడు చంకను ఎక్కాలనేది మన తెలుగు సామెత...అయితే మలయాళీలు ఆ సామెతను చక్కగా ఉపయోగించుకున్నారు. బుధవారం కేరళ పర్యటనకు వచ్చిన షార్జా రాజుని ముఖ్యమంత్రి ఓ చిన్న అభ్యర్ధన చేశారు. ఫలితంగా ఎడారి దేశాలలో కారాగారాలలో మగ్గిపోతున్న 149 మందికి విమోచన దొరికింది. ఆ భారత ఖైదీలను విడుదల చేస్తూ షార్జా రాజు సుల్తాన్ మోహమ్మద్ అల్ ఖాస్మీ అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. స్వల్ప నేరాలపై శిక్ష అనుభవిస్తున్న ఆ ఖైదీలకు క్షమాభిక్ష ఇవ్వాలని కోరుతూ ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న షార్జా రాజును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన రాజు... మూడేళ్ల శిక్ష పూర్తి చేసుకోనున్న భారత ఖైదీల విడుదల చేస్తూ తక్షణ ఆదేశాలిచ్చారు. షార్జా రాజు ఖాస్మీ కేరళావాసి లులూ సూపర్ మార్కెట్ అధినేత యూసుఫ్ అలీ ఇంట్లో ఆతిథ్యం బుధవారం స్వీకరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







