బెంగళూరులోని పెట్రోల్‌ కొంటే.. బిర్యానీ ఉచితం

- September 29, 2017 , by Maagulf
బెంగళూరులోని పెట్రోల్‌ కొంటే.. బిర్యానీ ఉచితం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వారికి కొంతమేర ఉపశమనం కలిగించేందుకు బెంగళూరులోని ఓ పెట్రోల్‌ బంకు నిర్వాహకులు వినూత్నమైన ఆలోచన చేశారు. రూ.250తో పెట్రోల్‌ కొంటే.. వారికి ఉచితంగా బిర్యానీ అందిస్తున్నారు. ఓల్డ్‌ మద్రాస్‌ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర సర్వీస్‌ స్టేషన్‌ ఈ ఆఫర్‌ను పెట్టింది. తమ వద్దకు వచ్చి పెట్రోల్‌ కొనుగోలు చేసే వినియోగదారులకు ఉచితంగా బిర్యానీ అందిస్తుంది.
ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 6వరకు ఉంది. డీజిల్‌ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం ఈ ఆఫర్‌ వర్తించదండోయ్‌. పెట్రోల్‌ కొనుగోలు చేసిన ధరను బట్టి వినియోగదారులకు టీ, కాఫీ, సమోసా, కుకీస్‌తో పాటు బిర్యానీ ఇస్తున్నారు. ఓ వైపు పెట్రోల్‌.. మరో వైపు నోరూరించే బిర్యానీ ఆఫర్‌ భలే ఉంది కదూ..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com