బెంగళూరులోని పెట్రోల్ కొంటే.. బిర్యానీ ఉచితం
- September 29, 2017
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వారికి కొంతమేర ఉపశమనం కలిగించేందుకు బెంగళూరులోని ఓ పెట్రోల్ బంకు నిర్వాహకులు వినూత్నమైన ఆలోచన చేశారు. రూ.250తో పెట్రోల్ కొంటే.. వారికి ఉచితంగా బిర్యానీ అందిస్తున్నారు. ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర సర్వీస్ స్టేషన్ ఈ ఆఫర్ను పెట్టింది. తమ వద్దకు వచ్చి పెట్రోల్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఉచితంగా బిర్యానీ అందిస్తుంది.
ఈ ఆఫర్ అక్టోబర్ 6వరకు ఉంది. డీజిల్ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదండోయ్. పెట్రోల్ కొనుగోలు చేసిన ధరను బట్టి వినియోగదారులకు టీ, కాఫీ, సమోసా, కుకీస్తో పాటు బిర్యానీ ఇస్తున్నారు. ఓ వైపు పెట్రోల్.. మరో వైపు నోరూరించే బిర్యానీ ఆఫర్ భలే ఉంది కదూ..!
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









