బెంగళూరులోని పెట్రోల్ కొంటే.. బిర్యానీ ఉచితం
- September 29, 2017
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వారికి కొంతమేర ఉపశమనం కలిగించేందుకు బెంగళూరులోని ఓ పెట్రోల్ బంకు నిర్వాహకులు వినూత్నమైన ఆలోచన చేశారు. రూ.250తో పెట్రోల్ కొంటే.. వారికి ఉచితంగా బిర్యానీ అందిస్తున్నారు. ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర సర్వీస్ స్టేషన్ ఈ ఆఫర్ను పెట్టింది. తమ వద్దకు వచ్చి పెట్రోల్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఉచితంగా బిర్యానీ అందిస్తుంది.
ఈ ఆఫర్ అక్టోబర్ 6వరకు ఉంది. డీజిల్ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదండోయ్. పెట్రోల్ కొనుగోలు చేసిన ధరను బట్టి వినియోగదారులకు టీ, కాఫీ, సమోసా, కుకీస్తో పాటు బిర్యానీ ఇస్తున్నారు. ఓ వైపు పెట్రోల్.. మరో వైపు నోరూరించే బిర్యానీ ఆఫర్ భలే ఉంది కదూ..!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







