సీనియర్ జర్నలిస్టులకు రక్షణ కల్పించండి అని కోరుతూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ
- September 29, 2017
సీనియర్ జర్నలిస్టులు రాజ్ దీప్ సర్ దేశాయ్ (ఇండియా టుడే), రవీష్ కుమార్ (ఎన్డీటీవీ) లకు నెటిజన్లలో ఓ వర్గం నుంచి తీవ్రమైన బెదిరింపులు అందుతున్నాయని, అందువల్ల వీరికి వెంటనే రక్షణ కల్పించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అశోక్ చవాన్ కోరారు. ఈ మేరకు ఆయన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తమ విధులను నిర్వర్తిస్తున్న ఈ జర్నలిస్టులకు ప్రాణహాని ఉందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా వీరి భద్రతపై దృష్టి పెట్టాలని కోరారు. ఎం.ఎన్. కల్ బర్గి, గోవింద్ పన్నారే, గౌరీ లంకేశ్ వంటి జర్నలిస్టులు, రచయితల దారుణ హత్యల గురించి ప్రస్తావించిన ఆయన.. ఇలాంటి ఘటనలు ఈ స్వతంత్ర భారత చరిత్రలోనే సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్ దీప్ సర్ దేశాయ్, రవీష్ కుమార్ ల రక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







