సీనియర్ జర్నలిస్టులకు రక్షణ కల్పించండి అని కోరుతూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ
- September 29, 2017
సీనియర్ జర్నలిస్టులు రాజ్ దీప్ సర్ దేశాయ్ (ఇండియా టుడే), రవీష్ కుమార్ (ఎన్డీటీవీ) లకు నెటిజన్లలో ఓ వర్గం నుంచి తీవ్రమైన బెదిరింపులు అందుతున్నాయని, అందువల్ల వీరికి వెంటనే రక్షణ కల్పించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అశోక్ చవాన్ కోరారు. ఈ మేరకు ఆయన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తమ విధులను నిర్వర్తిస్తున్న ఈ జర్నలిస్టులకు ప్రాణహాని ఉందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా వీరి భద్రతపై దృష్టి పెట్టాలని కోరారు. ఎం.ఎన్. కల్ బర్గి, గోవింద్ పన్నారే, గౌరీ లంకేశ్ వంటి జర్నలిస్టులు, రచయితల దారుణ హత్యల గురించి ప్రస్తావించిన ఆయన.. ఇలాంటి ఘటనలు ఈ స్వతంత్ర భారత చరిత్రలోనే సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్ దీప్ సర్ దేశాయ్, రవీష్ కుమార్ ల రక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









