మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

- September 29, 2017 , by Maagulf
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

ముంబైలో వంతెనపై తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయిల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు రైల్వే శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ఇందులో 5 లక్షల రూపాయిలను కేంద్రం, 5 లక్షల రూపాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయని ఆయన అన్నారు. గాయపడిన వారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయిలు, స్వల్ప గాయాలకు గురైన వారికి 50 వేల రూపాయిలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com