తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

- September 30, 2017 , by Maagulf
తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

విజయవాడ: దుర్గమ్మ తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుందని తెలిపారు.సా.5.30గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుందన్నారు. నది మధ్య భాగంలో ఒక ఫంట్‌పై లేజర్‌షో ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. పాస్‌లున్నవారికే దుర్గాఘాట్‌లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. ఇతరులకు బ్యారేజీపై నుంచి తిలకించే అవకాశం ఉంటుందన్నారు. తెప్పోత్సవానికి 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com