నాగశౌర్య తాజా సినిమాకు హిందిలో ఆల్రైట్స్ కి గాను 1.25 కొట్లు
- September 30, 2017
“ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణవైభోగం”,” జ్యోఅచ్చుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియన్స్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నాగశౌర్య హీరోగా చేస్తున్న చిత్రానికి హిందిలో ఆల్రైట్స్ కి గాను 1.25 కొట్లు ఫ్యాన్సీ రేట్ తో అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ముల్పూరి లు సంయుక్తంగా ఐరా క్రియోషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయనున్నారు. కన్నడ లో “కిరిక్ పార్టి” అనే చిత్రంలో తన క్యూట్ ఫెర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దొచుకున్న రష్మిక మండన్న హీరోయిన్ గా తెలుగుకి పరిచయం చేస్తూ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన వెంకి కుడుముల ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్టైనర్ గా కాలేజి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం నవంబర్ చివిరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. హైదరాబాద్, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూట్ జరుపుకుంటోన్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. అయితే ఇంకా సెట్స్ పైనే ఉన్న ఈ సినిమాకు సంబంధించిన హిందీ ఆల్ రైట్స్ కోటీ పాతిక లక్షలకు అమ్మడవటం విశేషం.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







