హీరో విక్రమ్ తనయుడు ధ్రువ తెరంగ్రేటం

- October 01, 2017 , by Maagulf
హీరో విక్రమ్ తనయుడు ధ్రువ తెరంగ్రేటం

డైరెక్టర్ సందీప్ రెడ్డి  తెరకెక్కించిన అర్జున్ రెడ్డి రికార్డ్‌లతో పాటు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. నిర్మాత ప్రణయ్ రెడ్డి 'వంగా'  ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్మించగా....దాదాపు 40 కోట్లు రాబట్టింది ఈ ఫిల్మ్. అలాగే ఇందులో నటించిన హీరో విజయ్ దేవర్ కొండ, హీరోయిన్ షాలిని పాండే ఒకటేసారి క్రేజీ స్టార్స్ లాగా మారిపోయారు. కాగా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు. సూపర్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధ ఈ సినిమాను నిర్మించనున్నట్లు విక్రమ్ తెలిపారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ కు కలిసిచొచ్చినట్టు  ధ్రువకు కలిసివస్తోందో లేదో చూడాలి. ఆల్ ది బెస్ట్ ధ్రువ.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com