రెప్పపాటులో కూలిన బ్రిడ్జి

- October 02, 2017 , by Maagulf
రెప్పపాటులో కూలిన బ్రిడ్జి

దాదాపు రెండు కిలోమీటర్ల బ్రిడ్జి. రెప్పపాటులో కూలిపోయింది. కాదు.. కాదు.. కూల్చేశారు. ఎప్పుడో 78 ఏళ్ల క్రితం కట్టిన బ్రిడ్జిని.. అమాంతం కూల్చేశారు. కళ్లుమూసి తెరిచేంతలో భారీ బ్రిడ్జి స్థానంలో దట్టమైన దుమ్ము ధూళి కనిపించాయి.
న్యూయార్క్‌లో అతిపెద్ద కౌంటీలైన బ్రూక్లిన్‌, క్వీన్స్‌లను కలుపుతూ 1939లో కిజ్కియాస్కో అనే బ్రిడ్జిని నిర్మించారు. దీని పొడవు 1.8 కి.మీలు. వెడల్పు 38 మీటర్లు. నాటి అంచనాల దృష్ట్యా రోజుకు 10వేల కార్లు ప్రయాణించగల సామర్థ్యంతో నిర్మించారు. కానీ క్రమంగా కిజ్కియాస్కోపై రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య లక్షా 80 వేలకు పెరిగింది. దీంతో ప్రమాద అవకాశాలను గుర్తించిన అధికారులు ఈ ఏడాది ప్రారంభం నాటికి కిజ్కియాస్కోకు సమాంతరంగా అధునాతన మీకర్‌ అవెన్యూ బ్రిడ్జిని నిర్మించారు. ఏప్రిల్‌, 27నుంచి పాత వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. 
అప్పటి నుంచి కొనసాగుతోన్న కూల్చివేత ప్రక్రియ పేల్చివేతతో చివరిదశకు చేరింది. శక్తిమంతమైన డిటోనేటర్లతో జరిపిన పేలుడుకు వంతెనకు సమీపంలోని ఇళ్లు వణికిపోయాయి. కూల్చివేసిన వంతెన స్థానంలో 2020 నాటికి సరికొత్త బ్రిడ్జిని నిర్మించబోతున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com