ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచన

- October 02, 2017 , by Maagulf
ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచన

హైదరాబాద్‌లో కుంభవృష్టితో చేపట్టాల్సిన సహాయక చర్యలపై జీహెచ్‌ఎంసీ అధికారులు సమీక్ష నిర్వహించారు. మొత్తం 19 చెట్లు కూలినట్టు తేల్చారు. 2 ఇళ్లు గోడలు కూలినట్టు చెప్పారు. 354 ప్రాంతాల్లో నీరుపెద్ద ఎత్తున ఉన్నట్టు గుర్తించారు. 28 ప్రాంతాల్లో పవర్ కట్ ఉంది. 92 చోట్ల డ్రైనేజీ పొంగిపొర్లినట్టు తేల్చారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు బయటకు రావొద్దని సూచించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్. లోతట్టు ప్రాంతాల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కూలిన విద్యుత్ స్తంభాల తొలగింపు చేపడుతున్నట్టు చెప్పారు. కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే.. కాల్ సెంటర్ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా వర్షాలపై సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి సహాయక చర్యలపై సూచనలు అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com