హృద్రోగులకు కేంద్రం అందిస్తున్న శుభవార్త
- October 02, 2017
న్యూఢిల్లీ : హృద్రోగులకు కేంద్రం శుభవార్త అందించింది. కరోనరీ స్టెంట్ల కొరతతో గుండెజబ్బుతో బాధపడుతున్న రోగులు అవస్థలు పడుతున్న నేపథ్యంలో కేంద్రం కొరడా ఝళిపించింది. దేశంలోని స్టెంట్ల కొరత లేకుండా నిరాటంకంగా రోగులకు అందించాలని స్టెంట్ల తయారీదారులు, దిగుమతిదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో స్టెంట్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో జాతీయ ఔషధాల ధర నిర్ణాయక మండలి, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సంస్థలు సంచలన ఆదేశాలు జారీ చేశాయి. స్టెంట్ల కొరత లేకుండా నిరంతరంగా సరఫరా చేసి స్టెంట్ల పంపిణీపై తమకు వారం వారం నివేదిక సమర్పించాలని కేంద్ర సంస్థలు ఆదేశించాయి. గుండెజబ్బుతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఎలాంటి కొరత లేకుండా స్టెంట్లను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర సంస్థలు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









