హృద్రోగులకు కేంద్రం అందిస్తున్న శుభవార్త
- October 02, 2017
న్యూఢిల్లీ : హృద్రోగులకు కేంద్రం శుభవార్త అందించింది. కరోనరీ స్టెంట్ల కొరతతో గుండెజబ్బుతో బాధపడుతున్న రోగులు అవస్థలు పడుతున్న నేపథ్యంలో కేంద్రం కొరడా ఝళిపించింది. దేశంలోని స్టెంట్ల కొరత లేకుండా నిరాటంకంగా రోగులకు అందించాలని స్టెంట్ల తయారీదారులు, దిగుమతిదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో స్టెంట్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో జాతీయ ఔషధాల ధర నిర్ణాయక మండలి, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సంస్థలు సంచలన ఆదేశాలు జారీ చేశాయి. స్టెంట్ల కొరత లేకుండా నిరంతరంగా సరఫరా చేసి స్టెంట్ల పంపిణీపై తమకు వారం వారం నివేదిక సమర్పించాలని కేంద్ర సంస్థలు ఆదేశించాయి. గుండెజబ్బుతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఎలాంటి కొరత లేకుండా స్టెంట్లను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర సంస్థలు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







