హృద్రోగులకు కేంద్రం అందిస్తున్న శుభవార్త

- October 02, 2017 , by Maagulf
హృద్రోగులకు కేంద్రం అందిస్తున్న శుభవార్త

న్యూఢిల్లీ : హృద్రోగులకు కేంద్రం శుభవార్త అందించింది. కరోనరీ స్టెంట్ల కొరతతో గుండెజబ్బుతో బాధపడుతున్న రోగులు అవస్థలు పడుతున్న నేపథ్యంలో కేంద్రం కొరడా ఝళిపించింది. దేశంలోని స్టెంట్ల కొరత లేకుండా నిరాటంకంగా రోగులకు అందించాలని స్టెంట్ల తయారీదారులు, దిగుమతిదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో స్టెంట్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో జాతీయ ఔషధాల ధర నిర్ణాయక మండలి, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సంస్థలు సంచలన ఆదేశాలు జారీ చేశాయి. స్టెంట్ల కొరత లేకుండా నిరంతరంగా సరఫరా చేసి స్టెంట్ల పంపిణీపై తమకు వారం వారం నివేదిక సమర్పించాలని కేంద్ర సంస్థలు ఆదేశించాయి. గుండెజబ్బుతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఎలాంటి కొరత లేకుండా స్టెంట్లను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర సంస్థలు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com