దుబాయ్: ప్రాణాలు తెగించి కాపాడిన యువతికి 'అభయ ఉమన్' అవార్డు
- October 02, 2017
దుబాయ్: రెండు ట్రక్కులు ఢీకొట్టి ఎగసిపడిన మంటల నుంచి ట్రక్కు డ్రైవర్ను ఓ యువతి ప్రాణాలకు తెగించి కాపాడింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమాహ్ నగరంలో సోమవారం జరిగిందీ ఘటన. భారత్కు చెందిన హర్కిరిత్ సింగ్ రోజూలాగే ట్రక్కులో వెళ్తుండగా మరో ట్రక్కు ఢీకొని మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకున్న హర్కిరిత్ ఆర్తనాదాలు చేశాడు. స్నేహితురాలితో అటుగా కారులో వచ్చిన జవహర్ సైఫ్ అల్ కుమైతీ(22) వెంటనే స్పందించింది. స్నేహితురాలి వస్త్రాలను విప్పమని చెప్పి తనను కారులో ఉండాలని కోరింది. ఆ బట్టలతో మంటలను ఆర్పి అతడిని కాపాడింది. కాగా, జవహర్ ధైర్య సాహసాలను భారత రాయబారి నవదీప్సింగ్ సూరి కొనియాడారు. మరోవైపు ఆ యువతిని 'అభయ ఉమన్' అవార్డుతో సత్కరించనున్నట్లు దుబాయ్ అంబులెన్స్ అండ్ రెస్క్యూ సెక్షన్ తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









