దుబాయ్: ప్రాణాలు తెగించి కాపాడిన యువతికి 'అభయ ఉమన్' అవార్డు
- October 02, 2017
దుబాయ్: రెండు ట్రక్కులు ఢీకొట్టి ఎగసిపడిన మంటల నుంచి ట్రక్కు డ్రైవర్ను ఓ యువతి ప్రాణాలకు తెగించి కాపాడింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమాహ్ నగరంలో సోమవారం జరిగిందీ ఘటన. భారత్కు చెందిన హర్కిరిత్ సింగ్ రోజూలాగే ట్రక్కులో వెళ్తుండగా మరో ట్రక్కు ఢీకొని మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకున్న హర్కిరిత్ ఆర్తనాదాలు చేశాడు. స్నేహితురాలితో అటుగా కారులో వచ్చిన జవహర్ సైఫ్ అల్ కుమైతీ(22) వెంటనే స్పందించింది. స్నేహితురాలి వస్త్రాలను విప్పమని చెప్పి తనను కారులో ఉండాలని కోరింది. ఆ బట్టలతో మంటలను ఆర్పి అతడిని కాపాడింది. కాగా, జవహర్ ధైర్య సాహసాలను భారత రాయబారి నవదీప్సింగ్ సూరి కొనియాడారు. మరోవైపు ఆ యువతిని 'అభయ ఉమన్' అవార్డుతో సత్కరించనున్నట్లు దుబాయ్ అంబులెన్స్ అండ్ రెస్క్యూ సెక్షన్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







