రోడ్డు మార్గం కోసం నెజాద్ వాసుల ఆవేదన
- October 02, 2017
అభా: నెజాద్కి వెళ్ళే మౌంటెయిన్ రోడ్ కోసం అక్కడి గ్రామస్థులు కలత చెందుతున్నారు. గ్రామానికి వెళ్ళే రోడ్డు ప్రమాదకరంగా మారడంతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1970 తర్వాత ఈ రోడ్డుని ఇంతవరకూ ఎవరూ పట్టించుకోలేదనేది స్థానికుల ఆరోపణ. రోడ్డుతోపాటుగా, సరైన ఇన్ప్రాస్ట్రక్చర్ లేకపోవడం, విద్యుత్ సమస్యలు తమను ఇబ్బంది పెడుతున్నాయని వారు చెప్పారు. అబ్దుల్లా అల్ అస్మారి అనే ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ, సంబంధిత అధికారులు ఎందుకు తమను పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి కారణంగా వాటర్ ట్యాంకులు, ట్రక్లు విలేజ్కి రాలేకపోతున్నట్లు చెప్పాడాయన. వృద్ధులు ఈ మార్గంలో ప్రయాణించడం నరకప్రాయంగా మారిందంటున్నారు. బాహ్యప్రపంచంతో విలేజ్కి సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడివారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









