రోడ్డు మార్గం కోసం నెజాద్ వాసుల ఆవేదన
- October 02, 2017
అభా: నెజాద్కి వెళ్ళే మౌంటెయిన్ రోడ్ కోసం అక్కడి గ్రామస్థులు కలత చెందుతున్నారు. గ్రామానికి వెళ్ళే రోడ్డు ప్రమాదకరంగా మారడంతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1970 తర్వాత ఈ రోడ్డుని ఇంతవరకూ ఎవరూ పట్టించుకోలేదనేది స్థానికుల ఆరోపణ. రోడ్డుతోపాటుగా, సరైన ఇన్ప్రాస్ట్రక్చర్ లేకపోవడం, విద్యుత్ సమస్యలు తమను ఇబ్బంది పెడుతున్నాయని వారు చెప్పారు. అబ్దుల్లా అల్ అస్మారి అనే ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ, సంబంధిత అధికారులు ఎందుకు తమను పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి కారణంగా వాటర్ ట్యాంకులు, ట్రక్లు విలేజ్కి రాలేకపోతున్నట్లు చెప్పాడాయన. వృద్ధులు ఈ మార్గంలో ప్రయాణించడం నరకప్రాయంగా మారిందంటున్నారు. బాహ్యప్రపంచంతో విలేజ్కి సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడివారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







