భవనంపైనుంచి పడి భారతీయ గర్భిణి మృతి
- October 03, 2017
షార్జాలో ఓ భవనం మీద నుంచి పడి, ఓ గర్భిణి మృతి చెందింది. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అల్ మజిజ్ ప్రాంతంలోని ఓ హై రైజ్ భవనంలోగల ఏడవ అంతస్తు నుంచి 32 ఏళ్ళ భారతీయ మహిళ కింద పడిపోయింది. ఉదయం 9.30 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఐదేళ్ళ కుమార్తె ఉంది మృతురాలికి. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి అని ఆ భవనంలో నివసిస్తున్న వారు చెప్పారు. మృతురాలు ఆ భవనంలోని మూడో అంతస్తులో నివసిస్తుండగా, తన స్నేహితురాలిని కలిసేందుకు ఏడో అంతస్తులోకి వెళ్ళింది. అక్కడ ఆమె, తన స్నేహితురాలితో మాట్లాడుతూ, మంచి నీళ్ళు కావాలని అడగడం, స్నేహితురాలు అలా వెళ్ళగా ఆమె భవనం నుంచి కిందికి దూకేసిందని తెలియవస్తోంది. మృతురాలి సంబంధీకుల్ని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







