భవనంపైనుంచి పడి భారతీయ గర్భిణి మృతి
- October 03, 2017
షార్జాలో ఓ భవనం మీద నుంచి పడి, ఓ గర్భిణి మృతి చెందింది. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అల్ మజిజ్ ప్రాంతంలోని ఓ హై రైజ్ భవనంలోగల ఏడవ అంతస్తు నుంచి 32 ఏళ్ళ భారతీయ మహిళ కింద పడిపోయింది. ఉదయం 9.30 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఐదేళ్ళ కుమార్తె ఉంది మృతురాలికి. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి అని ఆ భవనంలో నివసిస్తున్న వారు చెప్పారు. మృతురాలు ఆ భవనంలోని మూడో అంతస్తులో నివసిస్తుండగా, తన స్నేహితురాలిని కలిసేందుకు ఏడో అంతస్తులోకి వెళ్ళింది. అక్కడ ఆమె, తన స్నేహితురాలితో మాట్లాడుతూ, మంచి నీళ్ళు కావాలని అడగడం, స్నేహితురాలు అలా వెళ్ళగా ఆమె భవనం నుంచి కిందికి దూకేసిందని తెలియవస్తోంది. మృతురాలి సంబంధీకుల్ని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









