లండన్లో విజయ్ మాల్యా అరెస్ట్, బెయిల్ పై విడుదల
- October 03, 2017
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను లండన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో మాల్యాను అరెస్టు చేసినట్లు సమాచారం. భారత్లోని బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లను ఎగవేసిన మాల్యా లండన్ వెళ్లి తలదాచుకుంటున్నాడు. అతడిని అప్పగించమని భారత ప్రభుత్వం బ్రిటన్ను కోరింది. అందుకు అంగీకరించిన బ్రిటన్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేయడం ఇది రెండో సారి. అయితే ఆయనకు వెంటనే బెయిల్ రావడంతో విడుదలయ్యారు.
ఏప్రిల్ నెలలో మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ కొద్ది సేపటికే అతడు బెయిల్పై విడుదలయ్యాడు. వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి మార్చి 2016 నుంచి మాల్యా బ్రిటన్లో ఉంటున్నాడు. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







