ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్ రోజుకు 4జీబీ డేటా
- October 03, 2017
టెలికాం మార్కెట్లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్లతో హోరెత్తికిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ రూ.999ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రీ పెయిడ్ రీఛార్జ్ ఆఫర్ 28 రోజుల పాటు వాలిడ్లో ఉంటుందని, దీని కింద ఉచిత వాయిస్ కాల్స్ను కూడా అందించనున్నట్టు పేర్కొంది. అంటే 28 రోజుల్లో 122జీబీని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు పొందుతారు.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి టెలికాం సెక్టార్లో ఈ డేటా యుద్ధం నెలకొంది. రిలయన్స్ జియో రూ.999 ప్లాన్కు పోటీగా ఎయిర్టెల్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. జియో రూ.999 రీఛార్జ్ కింద 90జీబీ 4జీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. అయితే 90 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. ఒకవేళ 90జీబీ డేటా వాడకం అయినపోయిన తర్వాత స్పీడు 128 కేబీపీఎస్కు పడిపోతుంది. ఆ ప్లాన్ జియో ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. తాజాగా జియో తన రూ.149 ప్లాన్ను అప్డేట్ చేసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









