3.2 బిలియన్ సౌదీ రియాల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్పై మక్కా ఎమిర్ సంతకం
- October 03, 2017
జెడ్డా: మక్కా ఎమిర్, మక్కా డెవలప్మెంట్ అథారిటీ ప్రెసిడెంట్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, 3.2 బిలియన్ సౌదీ రియాల్స్ విలువైన మక్కా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించిన కాంట్రాక్ట్పై సంతకం చేశారు. కింగ్డమ్ విజన్ 2030లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టినట్లు వివరించారాయన. 10 ఏళ్ళకుగాను 400 బస్సుల సప్లయ్, ఆపరేషన్, మెయిన్టెనెన్స్లను కన్సార్టియమ్ ఈ ఒప్పందం కింద నిర్వహిస్తుంది. వీటిల్లో 240 ఆర్డినరీ బస్సులు ఉంటాయి. 160 ఆర్టికాలిక్యులేటెడ్ బస్సులు ఉంటాయి. అత్యున్నత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ స్టాండర్డ్స్తో ఈ బస్సులు నిర్వహించబడతాయి. తొలి ఫేస్లో బస్ నెట్వర్క్ 12 లైన్లతో 300 కిలోమీటర్ల మేర ఉంటుంది. వీటిల్లో ఏడు లైన్లు లోకల్గా ఉంటాయి. 83 స్టాప్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తారు. 172 కిలోమీటర్ల పొడవుతో ఫాస్ట్ లైన్స్ (మిగిలిన ఐదు) ఉంటాయి. బస్లకు సంబంధించి కంట్రోల్, ఆపరేషన్స్ కోసం 220,000 చదరపు మీటర్ల వైశాల్యంలో మెయిన్టెనెన్స్ సెంటర్ని నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







