వలస కుటుంబాన్ని ఆదుకున్న అజ్మన్ పోలీస్
- October 05, 2017
అజ్మన్ పోలీసులు 38 ఏళ్ళ మహిళ, 71 ఏళ్ళ వయసుగల ఆమె తల్లి, అలాగే 9 ఏళ్ళ వయసుగల కుమార్తెలను ఒక్కటి చేసి, వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేశారు. చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ దుబాయ్తో కలిసి అజ్మన్ పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు. చెక్ బౌన్స్ కేసులో 38 ఏళ్ళ మహిళ చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడంతో వృద్ధురాలు, అలాగే చిన్నారిని వారు నివాసం ఉంటోన్న ఇంటి ఉంచి యజమాని తరిమేశారు. దాంతో ఈ కేసుని పరిశీలించిన అజ్మన్ పోలీస్ - కమ్యూనిటీ సపోర్ట్ సెంటర్ డైరెక్టర్ కెప్టెన్ వాఫా అల్ హోసాని, తొమ్మిదేళ్ళ చిన్నారిని, ఆమె తల్లి అలాగే గ్రాండ్ మదర్తో కలపగలిగారు. అనంతరం వారికి స్వదేశానికి వెళ్ళేందుకు టిక్కెట్లను కూడా ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబం ఉజ్బెక్కి చెందినవారు. గ్రాండ్ మదర్ లుడా మిలా, పోలీసులు తమ పట్ల దయాపూర్వకంగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









