1,000 కిలోల ఆహార పదార్ధాలు నాశనం చేసిన ఢోఫర్ మున్సిపాలిటీ
- October 06, 2017
మస్కట్ : ' కలిపి కొట్టరా...కావేటి రంగా ' అని మస్కట్ లో వ్యాపారులు మస్కా కొట్టలేరు.. వేపుళ్ళు మాటున కుళ్ళిన మాంసాలను అమ్మడం...వేడి వేడిగా పాడైన ఆహార పదార్ధాలను వినియోగదారులకు వడ్డించేయడం ఏ మాత్రం చెల్లదిక్కడ..తాజాగా ధోఫర్ మున్సిపాలిటీచే 1,000 కిలోగ్రాముల ఆహారధాన్యాలు నాశనం చేసింది. ఆ తర్వాత గవర్నరేట్ పరిధి లోని పలు దుకాణాలలో ఆకస్మికంగా పలు ఆహార పదార్ధాల తనిఖీ నిర్వహించింది. "ధోఫార్ మున్సిపాలిటీలో ఆహార నియంత్రణ శాఖ ఇన్స్ పెక్టర్ల సమన్వయంతో పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి మానవ వినియోగం కోసం ఏ మాత్రం పనికిరాని దాదాపు 1,236 కిలోల వివిధ ఆహార పదార్థాలు, అలాగే 3,615 లీటర్ల శీతల పానీయాలు, పాడైన పండ్ల రసాలను, కలుషితమైన తాగునీటిని నాశనం చేశారు. ఆయా ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలకు తెలియచేసినట్లు ఆన్ లైన్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ధోఫర్ మున్సిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









