2019 అసెంబ్లీ కోసం జనసేన ఎన్నికల ప్లాన్
- October 07, 2017
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ర్టాల్లో మొత్తం స్థానాలకు పోటీ చేస్తున్నట్లు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రస్తుతం జనసేన.. ఎన్డీయేలో భాగస్వామి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు వుంటుందో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పవన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
మొన్నటికిమొన్న తెలుగు రాష్ర్టాల్లో 175 సీట్లకే పోటీ చేస్తామని జనసేన పార్టీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన విషయం తెల్సిందే! త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'ప్రజాయాత్ర'కు రెడీ అవుతున్నారని, దీని ముఖ్యఉద్దేశం ప్రజా సమస్యల పరిష్కారమేనని స్పష్టంచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తారని, 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు జన సైనికులకే టికెట్లు ఇస్తామన్న ఆయన, పార్టీ కోసం పనిచేసే వారందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ప్రత్యేకహోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కృష్ణాజిల్లాలో జనసేన ఔత్సాహిక కార్యకర్తల ఎంపిక శని,ఆదివారాల్లో జరుగుతోందని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి హరిప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







