13న దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్
- October 07, 2017ఢిల్లీ: ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ కానున్నాయి. పెట్రో డీలర్లు 13న దేశవ్యాప్తంగా పెట్రో బంక్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 54 వేల బంక్ లు మూతపడనున్నట్లు సమాచారం. ఈ బంద్ కు నేషనల్ పెట్రోలియం ఫ్రంట్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించినట్లు పెట్రో డీలర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. 2016, నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకు నిర్ణయం తీసుకోక పోవటాన్ని వీరు తప్పుబట్టారు. రోజువారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామన్న పెట్రోలియం శాఖ ఇప్పటికే విధివిధానాలను సైతం రూపొందించ లేదని ఆరోపించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 13వ తేదీన దేశవ్యాప్తంగా 54 వేల పెట్రోల్ బంకులు 24 గంటలపాటు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే.. ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధికంగా బంకులు బంద్ చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్