13న దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్
- October 07, 2017
ఢిల్లీ: ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ కానున్నాయి. పెట్రో డీలర్లు 13న దేశవ్యాప్తంగా పెట్రో బంక్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 54 వేల బంక్ లు మూతపడనున్నట్లు సమాచారం. ఈ బంద్ కు నేషనల్ పెట్రోలియం ఫ్రంట్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించినట్లు పెట్రో డీలర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. 2016, నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం డీలర్ల కమీషన్ పెంపుపై ఇంత వరకు నిర్ణయం తీసుకోక పోవటాన్ని వీరు తప్పుబట్టారు. రోజువారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామన్న పెట్రోలియం శాఖ ఇప్పటికే విధివిధానాలను సైతం రూపొందించ లేదని ఆరోపించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 13వ తేదీన దేశవ్యాప్తంగా 54 వేల పెట్రోల్ బంకులు 24 గంటలపాటు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే.. ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధికంగా బంకులు బంద్ చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









