జూపార్క్లో కేర్ టేకర్ ప్రాణం తీసిన తెల్ల పులులు
- October 08, 2017
బెంగళూరు బన్నేర్గట్ట జూపార్క్లో కేర్ టేకర్ ప్రాణం తీశాయి రెండు తెల్ల పులులు. నిన్న సాయంత్రం వాటికి ఆహారం పెట్టడానికి ఎన్క్లోజర్లోకి వెళ్లిన ఆంజనేయపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడి జరుగుతున్న విషయాన్ని సిబ్బంది ఎవరూ గుర్తించలేదు. దీంతో.. అతడిని కాపాడలేకపోయారు. పులుల దాడిలో ఆంజనేయకు తీవ్ర గాయాలు కావడంతో.. టైగర్ ఎన్క్లోజర్లోనే ప్రాణం వదిలాడు.
ఆంజనేయ మృతితో.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు జూపార్క్ దగ్గర ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు. అయితే.. విషయం తెలుసుకున్న అధికారులు మాత్రం... మొహం చాటేశారు. ఒక్కరు కూడా జూపార్క్ దగ్గరకు వచ్చి.. ఆంజనేయ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. స్థానిక నేతలు కొంతమంది.. ఆంజనేయ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అధికారులు మాత్రం ఈ దాడి ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నామంటున్నారు. జూ పార్క్లో మరోసారి ఇలాంటి దాడి జరగకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







