జూపార్క్లో కేర్ టేకర్ ప్రాణం తీసిన తెల్ల పులులు
- October 08, 2017
బెంగళూరు బన్నేర్గట్ట జూపార్క్లో కేర్ టేకర్ ప్రాణం తీశాయి రెండు తెల్ల పులులు. నిన్న సాయంత్రం వాటికి ఆహారం పెట్టడానికి ఎన్క్లోజర్లోకి వెళ్లిన ఆంజనేయపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడి జరుగుతున్న విషయాన్ని సిబ్బంది ఎవరూ గుర్తించలేదు. దీంతో.. అతడిని కాపాడలేకపోయారు. పులుల దాడిలో ఆంజనేయకు తీవ్ర గాయాలు కావడంతో.. టైగర్ ఎన్క్లోజర్లోనే ప్రాణం వదిలాడు.
ఆంజనేయ మృతితో.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు జూపార్క్ దగ్గర ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు. అయితే.. విషయం తెలుసుకున్న అధికారులు మాత్రం... మొహం చాటేశారు. ఒక్కరు కూడా జూపార్క్ దగ్గరకు వచ్చి.. ఆంజనేయ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. స్థానిక నేతలు కొంతమంది.. ఆంజనేయ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అధికారులు మాత్రం ఈ దాడి ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నామంటున్నారు. జూ పార్క్లో మరోసారి ఇలాంటి దాడి జరగకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







