టెక్సాస్ టెక్ యూనివర్శిటీలో పోలీస్ హతం.!
- October 09, 2017
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్ టెక్ యూనివర్శిటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్శిటీ క్యాంపస్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సయమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతడిని స్టేషన్ను తరలిస్తుండగా.. దుండగుడు తుపాకీ బయటకు తీసి పోలీస్ అధికారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ అధికారి అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పుల అనంతరం దుండగుడు పారిపోయాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటన నేపథ్యంలో యూనివర్శిటీని మూసివేశారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దుండగుడి వివరాలు తెలియరాలేదు.
ఇటీవలే లాస్వేగాస్లో ఓ దుండగుడు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. సంగీత కచేరీ జరుగుతుండగా వరుస కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక'ప్రజాశక్తి పెళ్లిపుస్తకం'. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







