జాక్‌పాట్ కొట్టేసిన ప్రణయ్

- October 10, 2017 , by Maagulf
జాక్‌పాట్ కొట్టేసిన ప్రణయ్

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌ వేలంలో హెచ్‌ఎస్ ప్రణయ్‌ జాక్‌పాట్ కొట్టాడు. స్టార్ ప్లేయర్స్ సింధు,సైనా, శ్రీకాంత్‌లను వెనక్కి నెట్ట్ ఏకంగా 62 లక్షల ధర పలికాడు. కొత్తగా లీగ్‌లోకి వచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రణయ్‌ని వేలంలో దక్కించుకుంది. ప్రణయ్ తర్వాత సమీర్‌వర్మ 52 లక్షలు, అజయ్ జయరామ్ 45 లక్షలు పలికారు. సింధు, సైనా, శ్రీకాంత్‌లను గత ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవడంతో వారు వేలంలోకి రాలేదు. అయితే గత సీజన్ ధర కంటే 25 శాతం ఎక్కువ వీరికి దక్కనుంది. కాగా డిసెంబర్‌లో పిబీఎల్ సీజన్ మొదలుకానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com