20 ఏళ్ళ తర్వాత కువైట్ లోనికి అక్రమంగా ప్రవేశించబోయిన భారతీయుడు అరెస్టు
- October 10, 2017
కువైట్ : ' కాలం ఎంతటి గాయానైనా మాన్పుతుందని..బహుశా అనుకున్నాడేమో ఆ భారతీయ వ్యక్తి ' కానీ కువైట్ లో నేరాలకు ఆ మాటలు వర్తించవని నిరూపితమయ్యాయి. 20 ఏళ్ల క్రితం కువైట్ లో నేరారోపణ నేపథ్యంలో దేశ బహిష్కరణకు గురైన ఓ భారతీయదు.. విషయం చల్లబడిందని భావించి మెల్లగా తిరిగి కువైట్ దేశంలోకి అక్రమంగా అడుగు పెట్టాడు. దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మరుక్షణమే ఆ నిందితుడిని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఓ అధికారి ఆ వ్యక్తి వివరాలను తనిఖీ చేసి, సంబంధిత వ్యక్తి ఇరవై ఏళ్ళ క్రితమే దేశ బహిష్కారణకు గురై కువైట్ లోనికి ప్రవేశించకుండా నాడు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నట్లు గుర్తించాడు . తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత అధికారులకు నేరస్థుడ్ని సూచించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







