పాపం జుహీ చావ్లా

- October 11, 2017 , by Maagulf
పాపం జుహీ చావ్లా

జనరల్ నాలెడ్జ్ విషయంలో బాలీవుడ్ యువ తార అలియా భట్ ఎంత అభాసుపాలైన సంగతి తెలిసిందే. మన దేశ ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు ప్రతిభా పాటిల్ అని చెప్పి అప్పట్లో చాలా సెటైర్లు ఎదురుకుంది అలియా.ఇప్పుడు జుహీ చావ్లా కూడా ఇలానే బుక్ అయ్యింది.
వివరల్ల్కి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియిన్ పరిధిలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంపై చావ్లా స్పందించింది. కోర్టు తీర్పును హర్షిస్తు.. ''ఢిల్లీ సుప్రీం కోర్టు బహ్మాండమైన తీర్పు ఇచ్చింది. నవంబరు 1వ తేదీ వరకు బాణసంచాపై నిషేధం ఉండాల్సిందే. ఈ దీపావళిని ప్రేమ, ఆప్యాయతలతో జరుపుకోండి'' అని ట్వీట్ చేసింది.
అయితే ట్వీట్ లో చిన్న పొరపాటు వుంది. ఢిల్లీ సుప్రీంకోర్టు అని రాసింది జుహీ. దీంతో ఢిల్లీకి ఎప్పుడు సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు అంటూ సెటర్ల పై సెటర్లు వేస్తున్నారు నెటిజన్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com