ఉత్తర కొరియాపై అగ్రరాజ్యం అమెరికా యుద్ధవిమానాలు
- October 11, 2017
అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అణుదాడి చేస్తామంటూ వరుస హెచ్చరికలకు దిగుతున్న ఉత్తరకొరియాకు దీటుగా బదులిచ్చేందుకు అమెరికా కూడా సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే ఉత్తరకొరియా నుంచి వచ్చే ముప్పుపై ఎలా స్పందించాలనే అంశంపై రక్షణశాఖ అధికారులతో ట్రంప్ నేడు సమావేశమయ్యారు. కాగా.. ఇదే సమయంలో కొరియన్ పెనిన్సులాపై అమెరికా యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడం గమనార్హం.
అమెరికాకు చెందిన రెండు విమానాలతో పాటు దక్షిణకొరియా మిలిటరీకి చెందిన రెండు ఫైటర్ జెట్లు కొరియన్ పెనిన్సులాపై చక్కర్లు కొట్టాయి. అయితే అమెరికా, దక్షిణకొరియా సంయుక్తంగా డ్రిల్ చేపట్టిందని.. అందులో భాగంగానే యుద్ధ విమానాలు వెళ్లినట్లు దక్షిణకొరియా అధికారిక ప్రకటన వెలువరించింది. మరోవైపు అమెరికా మిలిటరీ కూడా దీనిపై స్పందించింది. జపాన్కు చెందిన యుద్ధవిమానాలు కూడా ఈ డ్రిల్లో పాల్గొన్నట్లు పేర్కొంది.
అమెరికా, జపాన్, దక్షిణకొరియా సంయుక్తంగా మిలిటరీ డ్రిల్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇటీవల అమెరికాపై ఉత్తరకొరియా వరుస హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై అణుదాడి చేస్తామని బెదిరింపులకు దిగింది. దీంతో ఉత్తరకొరియా ఆగడాలను అరికట్టేందుకు అమెరికా కూడా చర్యలు చేపట్టింది. గువామ్ బేస్ నుంచే ఈ యుద్ధవిమానాల డ్రిల్ చేపట్టింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







