సౌదీ ఆయుధాల వినియోగంపై నిఘా పెట్టిన బ్రిటన్
- October 11, 2017
- ఐరాసలో బ్రిటన్ రాయబారి మ్యాథ్యూ రిక్రాఫ్ట్
సౌదీ అరేబియా ఆయుధాల వినియోగంపై నిఘా పెట్టినట్టు ఐరాసలో బ్రిటన్ రాయబారి మ్యాథ్యూ రిక్రాఫ్ట్ తెలిపారు. బ్రిటన్ నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను సౌదీ అరేబియా..ఉగ్ర సంస్థలకు సరఫరా చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో బ్రిటన్ రాయబారి పై విధంగా స్పందించారు. కాగా, యెమెన్లోని పౌర నివాసాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని సౌదీ సంకీర్ణదళాలు వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. సౌదీ సంకీర్ణదళాల దాడుల్లో ఎందరో అమాయకులు మృతి చెందారు. సౌదీ తీరుపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాకుండా, సౌదీకి ఆయుధాల సరఫరాను తక్షణమే నిలిపివేయాలని బ్రిటన్ను పౌర సంఘాలు అభ్యర్థిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం...2016లో సౌదీ సంకీర్ణదళాలు జరిపిన వైమానిక దాడుల్లో 683 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ఐరాస నివేదికను రిక్రాఫ్ట్ తప్పుపట్టారు.
సౌదీ అరేబియాకు బ్రిటన్ ఆయుధాలు సరఫరా చేయడంలో తప్పేమీ లేదని లండన్ కోర్టు తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ హక్కుల సంఘాల అభ్యర్థనను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తీర్పు ప్రకారం..సౌదీ ఆయుధాల వినియోగాన్ని పర్యవేక్షిస్తు న్నామని అన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









