సింగపూర్లో బాడీ మసాజ్లకూ రోబోలు!
- October 11, 2017రోబోలతో ఉద్యోగాలు పోతాయంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. సింగపూర్లో ఇప్పుడు ఏకంగా మసాజ్లు చేసే రోబోలు వచ్చేశాయి..! ఎక్స్పర్ట్ మానిప్యులేటివ్ మసాజ్ ఆటోమేషన్ (ఎమ్మా) అని పిలుస్తున్న ఈ రోబోను నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఝాంగ్ అభివృద్ధి చేశారు. ఏడాది కిందే తొలి నమూనా తయారైనా మార్పులు, చేర్పులు చేసి మరింత మెరుగుపరిచేందుకు కొంత సమయం పట్టింది.
తాజాగా సోమవారం నుంచి ఈ రోబో సింగపూర్లోని నోవాహెల్త్ ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ క్లినిక్లో మసాజ్లు చేయడం ప్రారంభించింది. శరీరంలోని టెండాన్లు, కండరాల పటుత్వాలను సెన్సర్ల ద్వారా గుర్తించి.. మసాజ్లు చేయడం వీటి ప్రత్యేకత. వెన్నెముక, మోకాళ్లకు మర్దన చేయడంలో మానవ మసాజర్లకు ఏమాత్రం తీసిపోదని ఝాంగ్ పేర్కొంటున్నారు. అయితే ఇది మనుషులకు ప్రత్యామ్నాయం కాదని.. ప్రస్తుతం క్లినిక్లలో మసాజ్లు చేస్తున్న వారిపై పని ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతోనే ఎమ్మాను తయారు చేశామని చెప్పారు. ఎక్కువ సమయం పట్టే మసాజ్ల విషయంలో మనిషికి బదులుగా రోబోను వాడతామన్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్