ఒక కారు కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్న నిర్వాసితులపై నిషేధ ప్రతిపాధన
- October 12, 2017కువైట్ : జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాహనాల సంఖ్య మరియు దేశం యొక్క రహదారుల సామర్ధ్యంపై ఒక అధ్యయనం పూర్తి చేసింది. దేశంలోని బెడోన్ నివాసితులపై విధించిన నిషేధం మాదిరిగానే జీసీసీ జాతీయులు, అరబ్బులు మరియు ఇతర విదేశీయులకు ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నవారిని దేశం నుండి నిషేధించాలని ఈ అధ్యయనం సిఫార్సు చేసింది. ఈ అధ్యయనం ప్రకారం 1.2 మిల్లియన్ వాహనాలను మాత్రమే రోడ్లపై తిరిగే సామర్ధ్యం కలిగి ఉంటె , అందుకు మించి 1.9 మిలియన్ల వాహనాలు దేశంలోని రహదారులపై తిరుగుతూ పలు రోడ్లపై తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఆ అధ్యయనం ప్రకారం దేశీయ కార్ల నమోదు ప్రక్రియలో భాగంగా ప్రవాసీయులకు అదనపు వాహనాలను నియంత్రణ చేయాలని సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ చర్యలు కనుక తీసుకొంటే ప్రస్తుతం అమలు చేయబడుతున్న రహదారుల ప్రాజెక్టులలోని వివిధ రహదారులపై ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!