నా తరువాత సినిమా మహేష్ తో అంటున్న దర్శక ధీరుడు
- October 13, 2017
బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో రుచి చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి..తన నెక్స్ట్ సినిమా ఏంటి..? ఎప్పుడు చేస్తాడు..? ఏ హీరోతో చేయబోతున్నాడు..? ఎలాంటి కథ తో వస్తున్నాడని సినిమా ప్రేక్షకులే కాదు అన్ని ఇండస్ట్రీల వారు ఆసక్తిగా కొన్ని నెలలుగా ఎదుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు తెరదించాడు రాజమౌళి.
తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా గురించి తెలిపారు. సూపర్స్టార్ మహేశ్బాబు తో తన నెక్స్ట్ సినిమా అని అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని మీడియా కు తెలిపాడు. 'నా తర్వాతి చిత్రంలో ఎవరు నటిస్తారు, దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. దానయ్య(నిర్మాత)తో సినిమాకు ఒప్పుకున్నా. అదే నా తర్వాతి చిత్రం' అని జక్కన్న చెప్పుకొచ్చాడు.
2019లో రాజమౌళి-మహేశ్ సినిమా సెట్స్ పైకి రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేశ్ కొరటాల శివ దర్శకత్వం లో 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









